కరోనాపై ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్న యువత
ABN , First Publish Date - 2020-03-24T19:23:01+05:30 IST
సంగారెడ్డి : కరోనాపై గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు యువత నడుం బిగించింది. సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి : కరోనాపై గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు యువత నడుం బిగించింది. సంగారెడ్డి జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేటలో కరోనా వైరస్ పై ప్ల కార్డుల ద్వారా గ్రామస్తులకు యువత అవగాహన కల్పిస్తోంది. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు వివరించింది. అనంతరం గ్రామస్తులందరికీ యువత మాస్కులు పంపిణీ చేసింది.