వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదు
ABN , First Publish Date - 2020-06-06T23:20:08+05:30 IST
వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదు
![వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020060605463352/06062020174959n28.gif)
వరంగల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదైంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన వెంకటయ్య కరోనాతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు.