ఎక్కువ మందికి కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదు: హైకోర్టు

ABN , First Publish Date - 2020-05-09T00:24:17+05:30 IST

కరోనా వైరస్ పరీక్షల విషయంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం అవలంభిసస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరపడం లేదని పిటిషనర్ విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు కోర్టుకు తెలిపారు.

ఎక్కువ మందికి కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదు: హైకోర్టు

హైదరాబాద్: కరోనా వైరస్ పరీక్షల విషయంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం అవలంభిసస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరపడం లేదని పిటిషనర్ విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారించింది. కరోనా పరీక్షలు ఎందుకు జరపడం లేదని ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అనుమానితులకే కరోనా పరీక్షలు చేయాలని ఎందుకు నిర్ణయించారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. లక్షణాలు ఉన్న వారికే పరీక్ష చేయాలని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల్లో ఎక్కడుందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కంటైన్ మెంట్ జోన్లలో ప్రజలందరికీ కరోనా పరీక్షలు జరపాలని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు ఎందుకు చేయడం లేదో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. పూర్తిస్థాయి పరీక్షలు చేయకపోతే వాస్తవాలు ఎలా తెలుస్తాయని హైకోర్టు ప్రశ్నించింది. గణాంకాలతో గజిబిజి చేస్తే కరోనా వ్యాప్తిపై వాస్తవాలు తెలియదని హైకోర్టు వ్యాఖ్యనించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.

Updated Date - 2020-05-09T00:24:17+05:30 IST