కరోనా వదంతులు.. ఇద్దరిపై కేసు
ABN , First Publish Date - 2020-03-24T11:21:18+05:30 IST
వికారాబాద్ జిల్లా తాండూరులో కరోనా రోగిని జిల్లా ఆస్పత్రిలో అడ్మిట్ చేశారంటూ వాట్సా్పలో వదంతులు ప్రచారం చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంగడిరాయిచూర్కు చెందిన

తాండూరు, మార్చి 23: వికారాబాద్ జిల్లా తాండూరులో కరోనా రోగిని జిల్లా ఆస్పత్రిలో అడ్మిట్ చేశారంటూ వాట్సా్పలో వదంతులు ప్రచారం చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంగడిరాయిచూర్కు చెందిన ఓ మహిళ ఇటీవల చెన్నై నుంచి వచ్చింది. ఆమెకు ఆదివారం తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్కు వెళ్తానని చెప్పింది. అయితే ఆ సమయంలో ఆమెను ఫొటోలు తీసిన కొందరు ‘కరోనా పేషెంట్’ అంటూ ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయ గా, వారు గ్రూప్ అడ్మిన్, క్రియేటర్పై కేసులు నమోదు చేశారు.