తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికం: వైద్య ఆరోగ్యశాఖ
ABN , First Publish Date - 2020-09-29T21:54:07+05:30 IST
తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెప్టెంబర్లో పాజిటివ్ రేటు 3 శాతం మాత్రమేనని తెలిపింది. వైరస్ తగ్గుతోందంటూ
![తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికం: వైద్య ఆరోగ్యశాఖ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020092903580470/09292020162354n11.jpg)
హైదరాబాద్: తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెప్టెంబర్లో పాజిటివ్ రేటు 3 శాతం మాత్రమేనని తెలిపింది. వైరస్ తగ్గుతోందంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించింది. ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు కంటిన్యూ చేయాలని, జూన్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామని, జిల్లా, తాలుకా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేశామని ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.