కరోనాపై అభ్యంతకర పోస్టులు.. ప్రొఫెసర్ సుజాతపై కేసు
ABN , First Publish Date - 2020-04-03T06:53:35+05:30 IST
మతకల్లోలాలకు దారితీసేలా పోస్టుచేసిన శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ వన్టౌన్ సీఐ విజయ్కుమార్ తెలిపారు.
మరోముగ్గురిపైనా ఎఫ్ఐఆర్.. ఒకరి రిమాండ్
కరీంనగర్ క్రైం, పెద్దేముల్/పూడూరు(వికారాబాద్ జిల్లా) ఏప్రిల్ 2: మతకల్లోలాలకు దారితీసేలా పోస్టుచేసిన శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ వన్టౌన్ సీఐ విజయ్కుమార్ తెలిపారు. కరోనా బాధితులు ఒకేవర్గానికి చెందిన వారనే అర్థం వచ్చేలా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆయన వివరించారు. బుధవారం రాత్రి వివిధ చట్టాల కింద సుమోటోగా కేసు పెట్టామన్నారు. కాగా.. ఇదే తరహా అభియోగాలపై సుధాకర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసులు తెలిపారు. సోషల్మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లికి చెందిన పి.రాంరెడ్డి, మధుకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాంరెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.