కరోనా రోగులకు రంజాన్ వంటకాలు
ABN , First Publish Date - 2020-04-26T08:21:28+05:30 IST
రంజాన్ మాసం మొదలవడంతో ఉపవాస దీక్షలో ఉండే కరోనా పాజిటివ్ రోగులకు ..

హైదరాబాద్/అడ్డగుట్ట, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రంజాన్ మాసం మొదలవడంతో ఉపవాస దీక్షలో ఉండే కరోనా పాజిటివ్ రోగులకు ప్రత్యేక వంటకాలను అందించాలని సర్కారు నిర్ణయించింది. వీరందరికీ ఇఫ్తార్ విందులోని వంటకాలతో కూడిన భోజనం ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. తెల్లవారు జామున దీక్షకు ముందే రొట్టెలు, పప్పుతో పాటు శాకాహార వంటకం అందిస్తారు. సాయంత్రం దీక్ష విరమించగానే ఇఫ్తార్ విందులో భాగంగా కిచిడి, బగారా రైస్, చికెన్, దాల్చా, వెజ్, నాన్వెజ్ బిర్యానీ అందించనున్నారు. రాత్రి ఎనిమిదిన్నర తరువాత అరటి, ఖర్జూరాలు పండ్లు, పాలు, బ్రెడ్, టీ ఇవ్వనున్నట్టు గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ రాజారావు, కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.