కరీంనగర్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు

ABN , First Publish Date - 2020-03-23T16:40:05+05:30 IST

జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రత్తమైంది. ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు

కరీంనగర్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు

కరీంనగర్: జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రత్తమైంది. ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కరోనా బాధితుడిని కలిసిన వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కాగా, కరోనా బాధితుడిని అధికారులు కరీంనగర్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా జిల్లాలో కరోనా సెకండ్ స్టేజ్‌కు చేరడంతో జిల్లా అధికార యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు సాయంత్రంలోగా ప్రభుత్వం కరీంనగర్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-03-23T16:40:05+05:30 IST