లాక్డౌన్ తర్వాత ఏం చేద్దాం?
ABN , First Publish Date - 2020-05-13T10:07:17+05:30 IST
రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై

- సీఎం కేసీఆర్ వద్ద ఉన్నతస్థాయి సమావేశం
- ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనిపై మంగళవారం సీఎం కేసీఆర్ వద్ద ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. మంత్రి ఈటల రాజేందర్తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు బీఆర్కే భవన్లో మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్కుమార్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి సమావేశమైౖ చర్చించారు. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత ఏం చేయాలన్న దానిపై ఒకటి రెండు రోజుల్లో నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్కు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రధానంగా వలసలతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. అలాగే ఐసీఎంఆర్ తాజాగా విడుదల చేసిన డిశ్చార్జ్ మార్గదర్శకాలపైనా చర్చలు జరుపుతోంది.