తెలంగాణలో భారీగా కరోనా కేసులు.. బుధవారం ఒక్కరోజే..
ABN , First Publish Date - 2020-07-09T03:39:36+05:30 IST
తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా ...
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1,924 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 11 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 324 మంది కరోనా సోకి చనిపోయారు. మొత్తం కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 29,836కు చేరుకుంది. ఇంకా 11,933 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా 992 మంది డిశ్చార్జి కాగా 17,279 మంది ఇప్పటివరకూ డిశ్చార్జి అయ్యారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 99, మేడ్చల్ జిల్లాలో 43, సంగారెడ్డిలో 20, కరీంనగర్లో 14, మహబూబ్నగర్లో 15, కామారెడ్డిలో 3, నల్గొండలో 13, వరంగల్ రూరల్లో 26, వరంగల్ అర్బన్లో 7, నిజామాబాద్లో 19, వికారాబాద్లో 11, మెదక్లో 5, పెద్దపల్లిలో 5, సూర్యాపేటలో 7, ఖమ్మంలో 4, జగిత్యాలలో 3, భద్రాద్రి కొత్తగూడెంలో 5, రాజన్న సిరిసిల్లలో 13, ఆదిలాబాద్లో 3, ఆసీఫాబాద్ లో 1, నాగర్ కర్నూల్లో 3, వనపర్తిలో 9, యాదాద్రిలో 5, నారాయణపేట్లో ఒక్క కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
