ఒక వైపు కరోనా భయం... మరోవైపు అసెంబ్లీ లాబీలు కిటకిట
ABN , First Publish Date - 2020-03-16T09:12:26+05:30 IST
మొత్తం 25 శాఖలకు సంబంధించిన పద్దులు.. 4 బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ. ఎప్పుడు ఏ సమాచారం అవసరమవుతుందో తెలియని పరిస్థితి. దీంతో
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మొత్తం 25 శాఖలకు సంబంధించిన పద్దులు.. 4 బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ. ఎప్పుడు ఏ సమాచారం అవసరమవుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఆయా శాఖల అధికారులు ఆదివారం అసెంబ్లీలో అందుబాటులో ఉన్నారు. వారికి తోడు మీడియా ప్రతినిధులు.. అసెంబ్లీ సిబ్బంది, భద్రతా సిబ్బందితో లాబీలు, ఇన్నర్ లాబీలు కిటకిటలాడాయి. అయితే అంతమంది అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులతో లాబీలు కిటకిటలాడాయి. ఒకరికొకరు ఎదురుపడినప్పుడు కరచాలనానికి బదులుగా నమస్కారాలు చేసుకోవడానికే ఆసక్తి చూపారు. వాష్రూంలో శానిటైజర్లు లేకపోవడాన్ని మీడియా ప్రతినిధులు అసెంబ్లీ అధికారుల దృష్టికి తీసుకురాగా.. వెన్వెంటనే ఆ ఏర్పాట్లు చేశారు. మొత్తానికి కరోనా వైరస్ నివారణపై ఆసక్తికరంగా చర్చించుకోవడం గమనార్హం.