కరోనా లక్షణాలతో జగిత్యాలలో ఒకరు మృతి
ABN , First Publish Date - 2020-07-19T03:36:39+05:30 IST
కరోనా లక్షణాలతో జగిత్యాలలో ఒకరు మృతి

జగిత్యాల: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాలలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా లక్షణాలతో జగిత్యాల ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందారని వైద్యులు తెలిపారు. కోడీమ్యాల మండలం సండ్రాల పల్లి గ్రామానికి చెందిన 38 సంవత్సరాల వికలాంగుడు మృతి చెందారు. మృతుడి శాంపిల్స్ సేకరించి వైద్యులు పరీక్షలకు పంపించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు.