మణుగూరులో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-06-23T16:05:39+05:30 IST
ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో కరోనా కలకలం రేపింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరులో కరోనా కలకలం రేపింది. సింగరేణిలో ఫిట్టర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటీవ్గా తేలింది. దాంతో ఆయనతోపాటు పనిచేస్తున్న వారిని క్వారంటైన్కు పంపించారు.