తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-27T16:10:11+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నగర మేయర్కు కోవిడ్ నిర్ధారణ అయింది. ఇక జిల్లాల్లో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. ఇటు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చాలా మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
తెలంగాణలో ప్రజాప్రతినిధుల చుట్టూ కరోనా వైరస్ తిరుగుతోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల్లో కొందరు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు వారి కుటుంబసభ్యులు, గన్ మెన్, వాచ్ మెన్, ఇతర సిబ్బందికి మహమ్మారి సోకుతోంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కొడుకు, కోడలు, ఇద్దరు పనివాళ్లు, వారి ఇద్దరు పిల్లలు వైరస్ బారిన పడ్డారు. అయితే ఈ ఆరుగురు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఖమ్మం జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ కాగా వారు హైరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయే గానీ తగ్గడంలేదు.