జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-06-25T23:08:57+05:30 IST
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ తెలంగాణలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. జీహెచ్ఎంసీకి సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన బ్యాంకులో క్యాషియర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కొద్దిరోజులుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించిన క్యాషియర్, ప్రతిరోజు వందమందికి పైగా వేతనాలు చెల్లించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఆఫీసులో ఇప్పటివరకు ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.