రక్తదానం చేసిన కానిస్టేబుల్ భార్య
ABN , First Publish Date - 2020-04-09T09:40:24+05:30 IST
త్యవసర సమయంలో రక్తదానం చేసిన ఓ కానిస్టేబుల్ భార్యను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. సిద్దిపేట్ కమిషనరేట్ పరిధిలోని రాయపోల్ ఠాణాలో కానిస్టేబుల్ శేఖర్ విధులు నిర్వహిస్తున్నారు
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): అత్యవసర సమయంలో రక్తదానం చేసిన ఓ కానిస్టేబుల్ భార్యను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. సిద్దిపేట్ కమిషనరేట్ పరిధిలోని రాయపోల్ ఠాణాలో కానిస్టేబుల్ శేఖర్ విధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట ఆస్పత్రిలో ఒకరికి అత్యవసరంగా బీ పాజిటివ్ రక్తం కావాలని వాట్సాప్ మెేసజ్ చూసిన శేఖర్ తన భార్య రేఖ బ్లడ్ గ్రూప్ అదే కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్తదానం చేయించారు. వారిని డీజీపీ మహేందర్ రెడ్డి ట్విటర్లో అభినందించారు.