మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం ప్రమాదం: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-08-22T18:46:28+05:30 IST

మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం పవర్‌ఫ్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు

మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం ప్రమాదం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం పవర్‌ఫ్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు శ్రీశైలం వెళ్తే బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. తప్పు చేయకపోతే ప్రభుత్వానికి భయమెందుకు? వారి కుట్రలను ప్రజలకు తెలియకుండా చేయాలని చూస్తున్నారు.. మమ్మల్ని అక్రమంగా నిర్బంధించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి దుర్మార్గాలు చేస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలియజేయాలి. శ్రీశైలం ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలి’ అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-22T18:46:28+05:30 IST