దళితుల హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోంది: కాంగ్రెస్ నేతలు
ABN , First Publish Date - 2020-08-01T19:17:31+05:30 IST
తెలంగాణలో దళితుల హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
![దళితుల హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోంది: కాంగ్రెస్ నేతలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: తెలంగాణలో దళితుల హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా సిద్దిపేటలోని వర్గల్ మండలం వేలూరుకు చెందిన దళిత రైతు నర్సింహులు భూమిని బలవంతంగా లాక్కోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. ఒకే రోజు ఇద్దరు దళితుల మృతిపై చర్యలు తీసుకోవాలి అంటూ కాంగ్రెస్ నాయకులు డీజీపీ మహేందర్రెడ్డికి వినతి చేశారు.