50 వేల టెస్టులు పూర్తి

ABN , First Publish Date - 2020-07-05T07:32:04+05:30 IST

కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్‌, దాని చుట్టూ నాలుగు జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన 50 వేల టెస్టులు

50 వేల టెస్టులు పూర్తి

కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్‌, దాని చుట్టూ నాలుగు జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన 50 వేల టెస్టులు శుక్రవారంతో పూర్తయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అదే స్థాయిలో టెస్టుల సంఖ్య కొనసాగుతుందని వెల్లడించింది. జూన్‌ 16 నుంచి టెస్టుల సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. 18 రోజుల వ్యవధిలోనే సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని వైద్య, ఆరోగ్యశాఖ పూర్తి చేసింది. జూన్‌ 16 నుంచి జూలై 3 మధ్య మొత్తం 50 వేల శాంపిల్స్‌ సేకరించి, నిర్థారణ చేశారు. అందులో 15269 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  95 మంది మరణించారు. ఇక 50 వేల టెస్టుల్లో పాజిటివ్‌ రేటు 30.5 శాతంగా నమోదైంది.

Updated Date - 2020-07-05T07:32:04+05:30 IST