ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-12T05:01:14+05:30 IST

ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్‌

ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె.నిఖిల

జనగామ టౌన్‌, డిసెంబరు 11: జనగామను రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా తిర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ కె.నిఖిల సూచించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాదాల నివారణపై జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు, ఆర్‌అండ్‌బి, రవాణా శాఖ, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో ఆమె సమీక్షించారు. సలహాలు, సూచనలు అందించారు. జిల్లా పరిధిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుర్తించి నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రత, నిబంధనలు, హల్మెట్‌ వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో డీసీపీ బ.శ్రీనివాసరెడ్డి, డీటీవో రమేశ్‌ రాథోడ్‌, నేషనల్‌ హైవే అథారిటీ అధికారి కిషోర్‌, ఏసీపీ వినోద్‌కుమార్‌, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:01:14+05:30 IST