23న సింగరేణి కార్మికులకు బోనస్‌: సీఎండీ

ABN , First Publish Date - 2020-10-14T06:37:33+05:30 IST

సింగరేణిలో లాభాల బోనస్‌ (28ు)ను ఈనెల 23న చెల్లించనున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

23న సింగరేణి కార్మికులకు బోనస్‌: సీఎండీ

కొత్తగూడెం, అక్టోబరు 13: సింగరేణిలో లాభాల బోనస్‌ (28ు)ను ఈనెల 23న చెల్లించనున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలు రూ.993.86 కోట్లు కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ.278.28 కోట్లను సంస్థ ఉద్యోగులు, కార్మికులకు బోన్‌సగా చెల్లిస్తామన్నారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.60,468 బోనస్‌ లభించే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే కరోనా నేపథ్యంలో మార్చిలో మినహాయించిన జీతాన్ని కూడా ఈనెల 23నే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని వెల్లడించారు. దీంతోపాటు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా పండగ అడ్వాన్స్‌ సొమ్ము ఒక్కొక్కరికి రూ.25 వేలను.. ఈనెల 19న చెల్లిస్తున్నామన్నారు.

Updated Date - 2020-10-14T06:37:33+05:30 IST