లాక్‌డౌన్ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించనున్న సీఎం

ABN , First Publish Date - 2020-03-24T16:22:34+05:30 IST

తెలంగాణలో లాక్‌డౌన్ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు

లాక్‌డౌన్ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించనున్న సీఎం

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మద్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే సమావేశంలో వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొననున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అనంతరం ఈ సాయంత్రం విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడతారు.

Updated Date - 2020-03-24T16:22:34+05:30 IST