ముదోల్‌ నియోజక వర్గంలో అభివృద్ధి పనులు సత్వరం పూర్తిచేయండి-సీఎం

ABN , First Publish Date - 2020-12-30T22:03:33+05:30 IST

ముదోల్‌ నియోజక వర్గం పరిధిలో పలు అభివృద్ధిపనులను సత్వరం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

ముదోల్‌ నియోజక వర్గంలో అభివృద్ధి పనులు సత్వరం పూర్తిచేయండి-సీఎం

హైదరాబాద్‌: ముదోల్‌ నియోజక వర్గం పరిధిలో పలు అభివృద్ధిపనులను సత్వరం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి పలు అంశాలను ప్రస్తావించారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా ఆరువేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన పిప్రి ఇరిగేషన్‌ పనులను చేపట్టాలని, 


గడ్డన్నవాగు ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన పది కిలోమీటర్ల పొడవు సిసి కెనాల్‌ను సత్వరమే పూర్తిచేయాలని, నియోజక వర్గంపరిధిలోని అర్లి వంతెన కూలిపోయే దశలో ఉన్నందున పునర్నిర్మాణ పనులను చేపట్టాలని, గుండెగావ్‌ గ్రామం ముంపునకు గురవుతున్నందున గ్రామ ప్రజలను ఆదుకునేందుకు నిర్వాసిత సహాయ కార్యక్రమాలను చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, స్పెషల్‌ సెక్రటరీ స్మితాసబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T22:03:33+05:30 IST