నేడు ఆర్థికశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
ABN , First Publish Date - 2020-06-23T16:32:34+05:30 IST
నేడు ఆర్థికశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పూర్తి వేతనాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే రైతులకు ప్రకటించే కొత్త పథకం, ఆర్థిక సౌలభ్యంపై చర్చించనున్నారు. కేంద్రం నుంచి నిధుల జారీ జాప్యంపై కూడా కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం.