బంజారాల ఆరాధ్యదైవం పౌరాదేవి పీఠాధిపతి మృతికి కేసీఆర్‌ సంతాపం

ABN , First Publish Date - 2020-10-31T23:22:31+05:30 IST

బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ శ్రీ తపస్వి పౌరాదేవి పీఠాధిపతి రామ్‌రావుమహారాజ్‌ శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపాన్నివ్యక్తం చేశారు.

బంజారాల ఆరాధ్యదైవం పౌరాదేవి పీఠాధిపతి మృతికి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ శ్రీ తపస్వి పౌరాదేవి పీఠాధిపతి రామ్‌రావుమహారాజ్‌ శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపాన్నివ్యక్తం చేశారు. రామ్‌రావు మహారాజ్‌ బంజారాల జీవితాల్లో మార్పుకోసం ఎన్నోసేవా కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. యావత్‌ భారత దేశంలోని బంజారాలను చైతన్య పరిచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కేసీఆర్‌ శ్రంసించారు. రామ్‌రావ్‌ మహారాజ్‌ స్పూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని బంజారాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2020-10-31T23:22:31+05:30 IST