సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇక నుంచి రైతులు..
ABN , First Publish Date - 2020-12-28T01:21:37+05:30 IST
వ్యవసాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్: వ్యవసాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నాడు వ్యవసాయం, రైతుబంధు సహా పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణలో నియంత్రిత సాగు విధానం ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పంటను సాగు చేసుకోవచ్చునని అన్నారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఏ సీజన్లో ఏ పంట వేయాలో రైతులు చర్చించుకోవాలని సీఎం సూచించారు.
అలాగే పంట ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే విక్రయించుకోవచ్చునని కేసీఆర్ అన్నారు. మద్దతు ధర వచ్చేలా వ్యూహం రూపొందించుకోవాలని రాష్ట్ర రైతాంగానికి సీఎం సూచించారు.