ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు
ABN , First Publish Date - 2020-11-03T20:38:02+05:30 IST
ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో పోలీసులు ఐదుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం నుంచి ఛత్తీస్గఢ్లో మావో అగ్రనేతలను కలిసి వారికి కావాల్సిన సమాచారం, వస్తువులను అందించేందుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.వారి నుంచి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, గ్రీన్ క్లాత్, నిత్యావసర వస్తువులు అందించేందుకు తీసుకెళ్తుండగా గుర్తించి పట్టుకున్నారు.