నిజామాబాద్లో యువకుడి అజాగ్రత్తకు చిన్నారి బలి
ABN , First Publish Date - 2020-09-28T00:07:52+05:30 IST
కంఠేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్మెంట్లో విషాదం చోటు చేసుకుంది. పార్కింగ్ సెల్లార్లో ...
నిజామాబాద్: కంఠేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్మెంట్లో విషాదం చోటు చేసుకుంది. పార్కింగ్ సెల్లార్లో యువకుడు అజాగ్రత్తగా కారు నడిపాడు. దీంతో ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు వాచ్మెన్ కూతురు మనిశ్వీగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.