ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఆదుకోండి: చాడ
ABN , First Publish Date - 2020-04-09T09:54:16+05:30 IST
ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఆదుకోండి: చాడ
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి సైతం అదనంగా ఒక నెల వేతనం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరా రు. ఈవిషయమై సీఎం కేసీఆర్కు బుధవారం ఆయన లేఖ రాశారు కరోనా కట్టడి కోసం వీరు సైతం ప్రాణా లు పణంగాపెట్టి రాత్రింబవళ్లు పని చేస్తున్నారని వివరించారు. మునిసిపల్ పారిశుధ్య కార్మికులకు రూ. 7500 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. మానవతా దృక్ఫథంతో ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఆదుకోవాలన్నారు.