సోమేష్‌కుమార్‌తో కేంద్ర బృందం సమావేశం

ABN , First Publish Date - 2020-04-26T00:27:19+05:30 IST

సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో కేంద్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎస్‌ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు. గచ్చిబౌలి ఆస్పత్రి ఏర్పాటుపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.

సోమేష్‌కుమార్‌తో కేంద్ర బృందం సమావేశం

హైదరాబాద్‌: సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో కేంద్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎస్‌ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు. గచ్చిబౌలి ఆస్పత్రి ఏర్పాటుపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కంటైన్‌మెంట్ జోన్ల గుర్తింపు విధానాన్ని సీఎస్‌ను అడిగి కేంద్ర బృందం తెలుసుకుంది. హైదరాబాద్‌లో కేసుల విస్తృతి ఎలా జరిగిందన్న దానిపై బృందం ఆరా తీసినట్లు సమాచారం. క్వారంటైన్ సమయం 28 రోజులకు పొడిగింపు ప్రయోజనాలను బృందానికి సోమేష్‌కుమార్ వివరించారు. కరోనా బాధితులకు ఆహారం, ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై కూడా కేంద్ర బృందం ఆరా తీసినట్లు తెలుస్తోంది. వలస కార్మికులకు అన్నపూర్ణ క్యాంటిన్లు, షెల్టర్‌ జోన్లు ఏర్పాటు చేశామని సీఎస్ చెప్పారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.

Updated Date - 2020-04-26T00:27:19+05:30 IST