వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-05-23T20:50:36+05:30 IST
లస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. దేశంలో పెద్ద ఎత్తున ఆహార నిల్వలున్నా పేదలకు పంచలేదని తప్పుబట్టారు
హైదరాబాద్: వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. దేశంలో పెద్ద ఎత్తున ఆహార నిల్వలున్నా పేదలకు పంచలేదని తప్పుబట్టారు. వలస కార్మికులను తరలించేందుకు ఆర్మీని రంగంలోకి దించితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తమ అధినేత సోనియా పిలుపుతో వలస కార్మికులను తామే తరలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను దారుణంగా తొక్కేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.