కేంద్రం రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇవ్వాలి: హరీశ్రావు
ABN , First Publish Date - 2020-09-24T22:56:29+05:30 IST
జీఎస్టీ, ఐజీఎస్టీ, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద... కేంద్రం రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన
![కేంద్రం రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇవ్వాలి: హరీశ్రావు](https://media.andhrajyothy.com/appimg/galleries/202009240439820/09242020172619n4.jpg)
సిద్దిపేట: జీఎస్టీ, ఐజీఎస్టీ, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద... కేంద్రం రాష్ట్రానికి 10 వేల కోట్లు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన కోటా ఇవ్వకుండా కేంద్రం మాయమాటలు చెబుతుందని ఆరోపించారు. బావులు, బోర్లాకాడ మీటర్లు పెట్టి విద్యుత్తు బిల్లు వసూళ్లు చేయాలని, రైతులకు అన్యాయం జరిగేలా కేంద్రం చర్యలు చేపట్టిందని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పొరేటికరణకు తెరలేపి... నయా జమీందారు వ్యవస్థను కేంద్రం తెస్తోందని హరీశ్రావు దుయ్యబట్టారు.