సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ

ABN , First Publish Date - 2020-12-16T01:59:29+05:30 IST

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. సీబీఐ కేసుల కన్నా ముందుగా ఈడీ కేసులను విచారణ జరపాలన్న

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ

హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. సీబీఐ కేసుల కన్నా ముందుగా ఈడీ కేసులను విచారణ జరపాలన్న అంశంపై వాదనలు పూర్తయ్యాయి. ఈడీ కేసులను మొదట విచారణ జరపాలన్న అంశంపై జనవరి 11న కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.


అలాగే సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. హైకోర్టులో ఐఏఎస్ శ్రీలక్ష్మి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. హైకోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్ తేలే వరకు సమయం ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ ఈ నెల 23కి న్యాయస్థానం వాయిదా వేసింది.

Updated Date - 2020-12-16T01:59:29+05:30 IST