తెలంగాణను వీడని కొత్త కరోనా భయం

ABN , First Publish Date - 2020-12-27T17:04:01+05:30 IST

కరోనా స్ట్రెయిన్ భయం ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని వీడలేదు.

తెలంగాణను వీడని కొత్త కరోనా భయం

హైదరాబాద్: కరోనా స్ట్రెయిన్ భయం ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని వీడలేదు. యూకే నుంచి వచ్చినవారిలో అనుమానిత పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు యూకే నుంచి వచ్చిన వారిలో ఇంకా 184 మంది ఆచూకీ దొరకలేదు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కొత్త కరోనా అటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త వైరస్ వ్యాప్తి చెందకుండా  వైద్యాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించిన అధికారులు.. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1216 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చారు. వారిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో  కొత్తగా మరో ఇద్దరికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతొ ఇప్పటి వరకు 18 మందికి కొత్త కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది.

Updated Date - 2020-12-27T17:04:01+05:30 IST