తెలంగాణలో కొత్తగా 1,607 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-07T15:28:08+05:30 IST

తెలంగాణలో కరోనా కేసులు గత నాలుగు రోజుల నుంచి పెరుగుతున్నాయి.

తెలంగాణలో కొత్తగా 1,607 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు గత నాలుగు రోజుల నుంచి పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,607 కరోనా కేసులు నమోదు కాగా.. ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. 1,372 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 19,936 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,27,583 మంది డిశ్చార్జ్ అయ్యారని  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఇప్పటి వరకు 45.75 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 296 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Updated Date - 2020-11-07T15:28:08+05:30 IST