తెలంగాణలో కొత్తగా 502 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-01T14:53:28+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 502 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,70,318కు చేరింది. 1,461 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,627 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,59,230 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 101, రంగారెడ్డి జిల్లాలో 32 కరోనా కేసులు నమోదయ్యాయి.