తెలంగాణలో కొత్తగా 1,602 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-06T15:14:16+05:30 IST

తెలంగాణలో కరోనా కేసులు గత మూడు రోజుల నుంచి పెరుగుతున్నాయి.

తెలంగాణలో కొత్తగా 1,602 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు గత మూడు రోజుల నుంచి పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,602 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,47,284కి చేరింది. 1,366 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 19,272 యాక్టివ్ కేసులుండగా, వారిలో 16,522 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స నుంచి కోలుకుని 2,26,646 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 295 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Updated Date - 2020-11-06T15:14:16+05:30 IST