హైదరాబాద్లో బెంజ్ కారు బీభీత్సం
ABN , First Publish Date - 2020-11-13T17:32:44+05:30 IST
మాదాపూర్లో బెంజ్ కారు బీభీత్సం సృష్టించింది.
హైదరాబాద్: మాదాపూర్లో బెంజ్ కారు బీభీత్సం సృష్టించింది. సైబర్ టవర్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్ను కారు ఢీకొంది. సిగ్నల్ జంప్ చేసి మరీ బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరిలో ఒకరు గౌతమ్ దేవ్ (33) మృతి చెందగా.. ఆయన భార్య శ్వేతకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారును నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మరణానికి కారణమైన కాశీ విశ్వనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కారులో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టిన మాదాపూర్ పోలీసులు పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు.