బై..బై.. గణేషా..
ABN , First Publish Date - 2020-09-01T10:17:21+05:30 IST
అంగరంగ వైభవంగా నిర్వహించుకొనే గణపతి నిమజ్జనం కోవిడ్ -19 నిబంధనలతో సాదాసీదాగా సాగింది.

కరోనా ఎఫెక్ట్తో సాదాసీదాగా నిమజ్జనం
వరంగల్ రూరల్ కల్చరల్, ఆగస్టు 31: అంగరంగ వైభవంగా నిర్వహించుకొనే గణపతి నిమజ్జనం కోవిడ్ -19 నిబంధనలతో సాదాసీదాగా సాగింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం భక్తి శ్రద్ధలతో మండపాల నుంచి గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చారు. ఊరేగింపులో డీ జే సౌండ్స్, డప్పుచప్పుళ్లు, నాట్యాలు, ఆటలు, పాటలను పోలీసులు అనుమతించలేదు. డివిజన్ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వినాయక విగ్రహాలను చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేశారు. భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చిన్న మట్టి గణపతులను తయారు చేసి కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా అర్చకులతో సంబంధిత వినాయక ఉత్సవాల కమిటీలు తమ గృహాల్లోనే వినాయకులను ఏర్పాటు చేసి తొమ్మిది రోజు పూజలు నిర్వహించారు.
నర్సంపేట: నర్సంపేట మునసిపాలిటి పరిధిలోని నర్సంపేట, ద్వారకపేట, సర్వాపురం వల్లబ్నగర్ తదితర ప్రాంతాలకు చెందిన గణపతి విగ్రహాలనునర్సంపేట సమీపంలోని దామెరచెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమాన్ని మునిసిపల్ కమిషనర్ విద్యాధర్, సీఐ సురేశ్బాబులు ప్రారంభించారు. ఆర్డీవో పవన్కుమార్, ఏసీపీ ఫణీందర్ పర్యవేక్షించారు.
పరకాల: పరకాలలో గణేషుడి నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, టాటాఏసీలను అందంగా ముస్తాబు చేశారు.
వర్ధన్నపేట : తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణనాఽథుడు సోమవారం గంగమ్మ వడికి చేరాడు. వర్ధన్నపేటతోపాటు పలు గ్రామాల్లో వివిధ వాహనాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం తరలించారు.