గుండెపోటుతో కారులోనే వ్యాపారి మృతి

ABN , First Publish Date - 2020-12-11T12:16:13+05:30 IST

తెల్లవారుజామున కారులోనే ఓ వ్యాపారి మృతిచెందిన ఘటన కలకలం రేపింది.

గుండెపోటుతో కారులోనే వ్యాపారి మృతి

  • హైదరాబాద్‌ వెళ్తుండగా బోధన్‌లో ఘటన
  • మృతుడు పార్సీగుట్టవాసిగా గుర్తింపు

హైదరాబాద్/బోధన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో గురువారం తెల్లవారుజామున కారులోనే ఓ వ్యాపారి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్‌లోని పార్సీగుట్టకు చెందిన శ్రీనివా్‌సగౌడ్‌ మహారాష్ట్రలో వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ ఆయనకు వ్యాపార లావాదేవీలు ఉండడంతో.. తరచూ వెళ్లి వస్తుంటాడు. గురువారం తెల్లవారుజామున సైతం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు సొంత ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా.. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కారును పక్కకు ఆపి అక్కడే ఉండిపోయాడు. కారులోనే గుండెపోటు తీవ్రత పెరగడంతో ప్రాణాలు కోల్పోయాడని పట్టణ సీఐ రామన్‌ తెలిపారు. కారులో రూ.5లక్షల వరకు నగదు, ఇతర పత్రాలు లభించడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. గుండెపోటుతోనే కారులో మృతిచెందాడని, ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. కారులోని నగదు, ఇతర పత్రాలు కుటుంబసభ్యులకు అప్పగించారు.

Updated Date - 2020-12-11T12:16:13+05:30 IST