రామోజీపేట బాధితులకు న్యాయం చేయాలి: రాంచంద్రం
ABN , First Publish Date - 2020-10-27T22:48:14+05:30 IST
కరీంనగర్, సిరిసిల్లా జిల్లాల అధ్యక్షులు నినాని రాంచంద్రం, చాకలి రమేష్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. బాధితులకు సత్వర మెరుగైన వైద్యం అందించాలని

కరీంనగర్: రామోజీపేట గ్రామంలో ఆదివారం రాత్రి దళితుల ఇళ్లపై జరిగిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ ఖండించింది. అధికార పార్టీకి చెందిన వారితో మతతత్వ పార్టీకి చెందిన మరికొందరు చేతులు కలిపి దళితులపై దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రామోజీ పేటలో ఆదివారం అర్థరాత్రి 11 గంటలకు ఈ దాడి జరిగిందని బీఎస్పీ నేతలు చెబుతున్నారు.
బీఎస్పీ కరీంనగర్, సిరిసిల్లా జిల్లాల అధ్యక్షులు నినాని రాంచంద్రం, చాకలి రమేష్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. బాధితులకు సత్వర మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్కు సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేని కలిసి నిందుతులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేతలు కోరారు.