భూపాలపల్లి అదనపు కలెక్టర్కు బ్రెయిన్ స్ట్రోక్
ABN , First Publish Date - 2020-10-03T09:33:03+05:30 IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ శుక్రవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. డీపీవో సుధీర్బాబు, స్థానిక తహసీల్దార్ అశోక్ భూపాలపల్లి నుంచి ఆయనను

అధిక పనిభారమే కారణమంటున్న ఉద్యోగులు
భూపాలపల్లి కలెక్టరేట్, అక్టోబరు 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ శుక్రవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. డీపీవో సుధీర్బాబు, స్థానిక తహసీల్దార్ అశోక్ భూపాలపల్లి నుంచి ఆయనను హుటాహుటిన హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, గణేశ్ మెదడులో రక్తం గడ్డకట్టి బ్రెయిన్ స్ర్టోక్కు గురైనట్లు అక్కడి వైద్యులు గుర్తించడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, పని ఒత్తిడి వల్లనే ఆయన అనారోగ్యం పాలయ్యారని ఉద్యోగులు తెలిపారు. జిల్లాలో ఓ ఉన్నతాధికారి తీరు వల్ల కీలక శాఖలకు చెందిన అధికారులు వరుస సెలవులపై వెళ్లడం, విధుల్లో చేరకపోవడంతో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ను ఇన్చార్జిగా నియమించారు. ఆయనకు ఏకంగా నాలుగు కీలక శాఖల బాధ్యతలు అప్పగించడంతో పనిభారం పడిందని ఉద్యోగులు చెబుతున్నారు.