అంకితభావంతో ఉద్యోగాల భర్తీ : వినోద్
ABN , First Publish Date - 2020-12-17T09:08:19+05:30 IST
Boinapalli Vinod Kumar

హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగాల భ ర్తీ అంశంపై కోదండరాంకు అపోహలు ఉండటం బాధాకరమన్నారు. ఒక ప్రొఫెసర్గా ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలిసి కూడా ఆయన విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు.