బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2020-12-30T21:27:45+05:30 IST

జగిత్యాల జిల్లా: గొల్లపల్లిలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం

జగిత్యాల జిల్లా: గొల్లపల్లిలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీస్ స్టేషన్‌లో ఉన్న బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గొల్లపల్లి వస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-12-30T21:27:45+05:30 IST