కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ: బండి సంజయ్
ABN , First Publish Date - 2020-06-06T18:31:45+05:30 IST
కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ: బండి సంజయ్
హైదరాబాద్: కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్లకే దిక్కు లేదని... కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు. కేంద్ర పథకాలనే తెలంగాణ ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందన్నారు. మోదీ ఏడాది పాలనను అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని.. దేశ జీడీపీని పెంచిన ఘనత ప్రధాని మోదీదే అని బండి సంజయ్ పేర్కొన్నారు.