కేంద్రం నిధులివ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-10-15T00:07:48+05:30 IST

తెలంగాణకు కేంద్రం నిధులివ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం సొమ్మును ..

కేంద్రం నిధులివ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా: బండి సంజయ్

సిద్దిపేట: తెలంగాణకు కేంద్రం నిధులివ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం సొమ్మును రాష్ట్ర నాయకులు గుంట నక్కల్లా తింటున్నారని ఆయన మండిపడ్డారు. టీఅర్ఎస్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించే వ్యక్తిని దుబ్బాక ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సంఘాల పేరుతో టీఆర్ఎస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోందని సంజయ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-15T00:07:48+05:30 IST