రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో బైక్స్ అపహరిస్తున్న ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-13T22:20:44+05:30 IST
రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో బైక్స్ అపహరిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆరుగురు దొంగల అరెస్ట్ చేశామని
హైదరాబాద్: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో బైక్స్ అపహరిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆరుగురు దొంగలను అరెస్ట్ చేశామని, నిందితుల వద్ద నుంచి 30 బైక్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అపహరించిన బైక్లను నాందేడ్లకు రూ.15వేల నుంచి 30వేలకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై బైక్స్ అపహరిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులు రాజేంద్రనగర్ యెన్నంగూడ బస్తీ వాసులుగా గుర్తించామన్నారు. గతంలో హైదర్గూడ ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ముఠా యత్నించిందని సజ్జనార్ తెలిపారు.