భద్రాది వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
ABN , First Publish Date - 2020-09-01T15:32:48+05:30 IST
ఎగువనున్న ఉపనదుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువనున్న ఉపనదుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. కావున అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జాలర్లు నదిలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35.7 అడుగులకు చేరుకుంది.