పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగిన అర్చకుడు
ABN , First Publish Date - 2020-04-15T09:36:05+05:30 IST
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం శివాలయం అర్చకుడు శివనాగస్వామి.. కరోనా కట్టడిలో కీలకభూమిక పోషిస్తున్న
![పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగిన అర్చకుడు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041504044668/04152020040555n93.jpg)
భద్రాచలం, ఏప్రిల్ 14: భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం శివాలయం అర్చకుడు శివనాగస్వామి.. కరోనా కట్టడిలో కీలకభూమిక పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగారు. మంగళవారం భద్రాచలంలోని రాజీవ్నగర్ కాలనీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల కాళ్లను పసుపు నీళ్లతో కడిగి, కాళ్లకు మొక్కడంతోపాటు వారికి నూతన వస్త్రాలు అందజేశారు.