రేషన్ షాపులవద్ద లబ్దిదారుల క్యూ
ABN , First Publish Date - 2020-04-05T17:25:40+05:30 IST
రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోడానికి లబ్దిదారులు క్యూ కడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా: రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోడానికి లబ్దిదారులు క్యూ కడుతున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానికులు సాయంగా నిలుస్తున్నారు. ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఓ షాపువద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు క్యూ లైన్లలో ఉన్నారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రోజుకు వందమంది లబ్దిదారులకు రేషన్ ఇస్తున్నామని చెప్పారు. వారికి ముందుగా కూపన్లు ఇస్తున్నామని, లబ్దిదారులు సామాజిక దూరం పాటించేలా తనకు అధికారులు, స్థానికులు సాయం చేస్తున్నారని చెప్పారు.